లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన 589 కార్మికులు..
- January 31, 2017
సుమారు 600 మంది కార్మికులు, లేబచ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు జనవరి నెలాఖరున వెల్లడయిన వీక్లీ రిపోర్ట్లో తేలింది. 450 మంది కమర్షియల్ వర్కర్స్, 60 మంది ఫామ్ వర్కర్స్, 79 మంది హౌస్మెయిడ్స్ తమ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. జనవరి 22 నుంచి 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో వీరిని కనుగొన్నారు. 536 మందిలో 289 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ కాగా, 244 మంది అస్ట్రాయ్ వర్కర్స్ కాగా, ముగ్గురి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లూ లేవు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో పెద్ద సంఖ్యలో కార్మికులు, లేబర్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు తేలింది. ఇక్కడ మొత్తం 162 మంది ఉల్లంఘనులున్నారు. ఆ తర్వాతి స్థానంలో నార్త్ అల్ బతినా 120 మంది ఉల్లంఘనులతో నిలిచింది. ఉల్లంఘనల్ని అతిక్రమించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. మేన్పవర్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 498 మంది వలసదారులైన కార్మికులు, నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను డిపోర్ట్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









