దారితప్పిన విమానం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
- February 01, 2017
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం వెళ్లవలసిన ఇండిగో విమానం ఒకటి విమానాశ్రయంలో దారి తప్పింది. అప్పటికే ఆ మార్గంలో జెట్ ఎయిర్వేస్ విమానం నిలిచి ఉంది. సకాలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తం చేయడంతో ముప్పును నివారించగలిగారు. ఇండిగో విమానం 6ఇ 719కు 28వ రన్ వే కేటాయించారు. 'సి' లేన్ ద్వారా ఆ విమానం రన్వేపైకి రావాలి. రన్వేను దాటి డబ్ల్యూ లేన్లోకి వెళ్లిపోయినట్లు కమాండర్ గుర్తించారు. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా అప్రమత్తం చేయడంతో కమాండర్ విమానాన్ని తక్షణం నిలిపివేశాడు. మంచు కారణంగా సరిగా కనిపించకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఇండిగో చెబుతుండగా, రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటనతో పలు విమానాలు గంట పాటు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









