పెరిగిన పసిడి, వెండి ధరలు
- February 07, 2017
వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,850కి చేరింది. ఇదే బాటలో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.29శాతం పెరిగి 1,235.20 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర 1.26శాతం పెరిగి 17.71డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









