పనీర్ జిలేబీ...
- February 08, 2017
కావలసిన పదార్ధాలు: పనీర్ తురుము- 1 కప్పు, మైదా- 4 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ- 2 టేబుల్ స్పూన్లు, పెరుగు- 1 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్- 1/2 టీ స్పూను, యాలకుల పొడి- 1 టీ స్పూను, పంచదార- 3 కప్పులు, నీళ్ళు- 3 కప్పులు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పంచదార, యాలకుల పొడి వేసి తీగ పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పనీర్లో మైదా, బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకుని రెండు గంటలు నాననివ్వాలి. ఆ తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనూ తాడులా పేనుతూ, జిలేబి చుట్ట లాగా గుడ్రంగా చుట్టి, తక్కువ మంట మీద నూనెలో వేగించుకోవాలి. తరువాత పాకంలో వేసి, కొంచెం ఉబ్బుగా అయ్యాక బయటకు తీసివేయాలి.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









