స్వైన్ ఫ్లూ లక్షణాలేంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...
- February 08, 2017
స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
పిల్లలకు జ్వరం తగ్గిన వెంటనే బడికి పంపకుండా ఒకటి, రెండు రోజులు ఇంట్లోనే ఉంచడం మంచిది. స్వైన్ ప్లూ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రోజుకు పది గ్లాసుల నీరు సేవించండి. దీని మూలంగా శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. దీని మూలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువసార్లు చేతుల్ని శుభ్రం చేసుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు కచ్చితంగా అడ్డం పెట్టుకోవాలి. మాస్కులు వాడటం మంచిది. అలాగే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. దీనితో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారంలో విటమిన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









