అక్కినేని నాగార్జున ప్రత్యేక పూజలు నిజామాబాద్‌ జిల్లాలో...

- February 09, 2017 , by Maagulf
అక్కినేని నాగార్జున ప్రత్యేక పూజలు నిజామాబాద్‌ జిల్లాలో...

సినీ హీరో అక్కినేని నాగార్జున నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం 'ఓంనమో వెంకటేశాయ' సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తంనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన సినీ కెరీర్‌లో ఓం నమో వెంకటేశాయ బెస్ట్ సినిమాగా నిలుస్తుందన్నారు. అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తున్న మా పల్లె చారిటబుల్ ట్రస్ట్‌కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com