'తొలి పరిచయం' పోలవరంలో...
- February 11, 2017
వెంకీ, లాస్య జంటగా పీయూకే ప్రొడక్షన్స పతాకంపై దీపక్కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'తొలి పరిచయం'. ఎల్. రాధాకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా ఫస్ట్లుక్ను ఆవిష్కరించారు. దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ''పెళ్లంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ల మధ్య ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. పోలవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన పనులు ముగింపుదశకొచ్చాయి'' అని చెప్పారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తామని హీరో వెంకీ తెలిపారు. జనసేన పార్టీ పాటలకు సంగీతాన్నిచ్చిన తనకు సంగీత దర్శకుడిగా ఇదే తొలి చిత్రమని సంగీత దర్శకుడు ఇంద్రగంటి చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







