మరో వరల్డ్ కప్ భారత్ ఖాతాలో...
- February 12, 2017
బెంగళూరు:అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు టైటిల్ ను నిలబెట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ జట్టు 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని లీగ్ దశలో పాక్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. క్రితంసారి పాకిస్తాన్ ను ఓడించి కప్ ను సాధించిన భారత్ అదే పరంపరను కొనసాగించి తుది పోరులో తమకు తిరుగులేదని నిరూపించింది.
భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య(99 నాటౌట్) మరోసారి విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
అతనికి జతగా అజయ్ కుమార్ రెడ్డి(43) ఆకట్టుకున్నాడు. మరొక ఆటగాడు కేతన్ పటేల్(26) రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









