భార్య హత్య కేసులో భర్తకు మరణ శిక్ష ..
- February 15, 2017
షార్జా క్రిమినల్ కోర్ట్, ఆసియా జాతీయుడికి భార్యను హత్య చేసిన కేసులో మరణ శిక్ష విధించింది. మృతురాలి బంధువులు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడికి క్షమాభిక్ష ఇవ్వరాదని విజ్ఞప్తి చేయడంతో నిందితుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. హత్యకు సంబంధించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం, నిందితుడు తన భార్యతో గొడవపడి, ఆ గొడవ కారణంగా భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ ఘటను చూసిన పొరుగువారు అతన్ని నిర్బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణలో నిందితుడు తానే తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







