భార్య హత్య కేసులో భర్తకు మరణ శిక్ష ..
- February 15, 2017
షార్జా క్రిమినల్ కోర్ట్, ఆసియా జాతీయుడికి భార్యను హత్య చేసిన కేసులో మరణ శిక్ష విధించింది. మృతురాలి బంధువులు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడికి క్షమాభిక్ష ఇవ్వరాదని విజ్ఞప్తి చేయడంతో నిందితుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. హత్యకు సంబంధించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం, నిందితుడు తన భార్యతో గొడవపడి, ఆ గొడవ కారణంగా భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ ఘటను చూసిన పొరుగువారు అతన్ని నిర్బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణలో నిందితుడు తానే తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









