భార్య హత్య కేసులో భర్తకు మరణ శిక్ష ..
- February 15, 2017
షార్జా క్రిమినల్ కోర్ట్, ఆసియా జాతీయుడికి భార్యను హత్య చేసిన కేసులో మరణ శిక్ష విధించింది. మృతురాలి బంధువులు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడికి క్షమాభిక్ష ఇవ్వరాదని విజ్ఞప్తి చేయడంతో నిందితుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. హత్యకు సంబంధించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం, నిందితుడు తన భార్యతో గొడవపడి, ఆ గొడవ కారణంగా భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ ఘటను చూసిన పొరుగువారు అతన్ని నిర్బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణలో నిందితుడు తానే తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







