ఇకపై ఆధార్ ఉండాల్సిందే స్కాలర్షిప్ కావాలంటే
- February 18, 2017న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలు అందుకోవాలంటే ఇకపై ఆధార్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఇప్పటికే స్కాలర్షిప్పులు పొందుతున్నవారు జూన్ 30 నాటికల్లా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా దీని నుంచి జమ్మూ కాశ్మీర్ను మినహాయిస్తున్నట్టు హెచ్ఆర్డీ తెలిపింది. కేంద్ర రంగ ఉపకారవేతనాల పథకం కింద స్కాలర్షిప్లు అందుకోగోరిన కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థులు సహా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందాలనుకుంటున్న పిల్లలు సైతం జూన్ 30లోగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్చార్డీ వెల్లడించింది.నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి స్కాలర్షిప్ జమ చేయడంతో పాటు ఆధార్ అనుసంధానం వల్ల ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..