మేలో శ్రీలంకకు వెళ్లనున్న మోదీ
- February 18, 2017
శ్రీలంకలో మే నెలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే బౌద్ధ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక న్యాయ మంత్రి విజయదాస రాజపక్సేను ఉటంకిస్తూ స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. కొలంబోలో తొలిసారి నిర్వహిస్తున్న 'యూఎన్ వేసాక్ డే' వేడుకల్లో పాల్గొనడానికి మోదీ అంగీకరించినట్లు తెలిపింది.
ఈ ఉత్సవాలను ఏటా బౌద్ధ మతస్థులున్న దేశాల్లో జరుపుకుంటారు. మే నెలలో నిండు చంద్రుడు కనిపించే రోజుకు సమీపంలోని ఆదివారం రోజున భక్తులు బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మే 12న జరిగే ఈ కార్యక్రమానికి పలు దేశాల నాయకులను ఆహ్వానించారు. చైనా, భారత్, జపాన్ , థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, లావోస్, టిబెట్ , భూటాన్, తదితర బౌద్ధ ప్రధాన దేశాల నుంచి వేయికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









