మేలో శ్రీలంకకు వెళ్లనున్న మోదీ
- February 18, 2017
శ్రీలంకలో మే నెలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే బౌద్ధ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక న్యాయ మంత్రి విజయదాస రాజపక్సేను ఉటంకిస్తూ స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. కొలంబోలో తొలిసారి నిర్వహిస్తున్న 'యూఎన్ వేసాక్ డే' వేడుకల్లో పాల్గొనడానికి మోదీ అంగీకరించినట్లు తెలిపింది.
ఈ ఉత్సవాలను ఏటా బౌద్ధ మతస్థులున్న దేశాల్లో జరుపుకుంటారు. మే నెలలో నిండు చంద్రుడు కనిపించే రోజుకు సమీపంలోని ఆదివారం రోజున భక్తులు బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మే 12న జరిగే ఈ కార్యక్రమానికి పలు దేశాల నాయకులను ఆహ్వానించారు. చైనా, భారత్, జపాన్ , థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, లావోస్, టిబెట్ , భూటాన్, తదితర బౌద్ధ ప్రధాన దేశాల నుంచి వేయికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







