వలసదారులకు ఎలక్ట్రిసిటీ టారిఫ్‌ 'డబుల్‌'

- February 20, 2017 , by Maagulf
వలసదారులకు ఎలక్ట్రిసిటీ టారిఫ్‌ 'డబుల్‌'

బహ్రెయిన్‌లో వలసదారులకు ఇకపై ఎలక్ట్రిసిటీ టారిఫ్‌ డబుల్‌ కానుంది. మార్చ్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రిసిటీతోపాటు, వాటర్‌ బిల్లులు కూడా 'డబుల్‌' మొత్తంలో వినియోగదారులకు షాక్‌ ఇవ్వనున్నాయి. 0 నుంచి 3000 యూనిట్స్‌ వరకు ప్రస్తుతం 6 ఫిల్స్‌గా ఉన్న బిల్లు ఇకపై 13 ఫిల్స్‌కి (ఒక్కో యూనిట్‌) చేరుకుంటుంది. అదే వాటర్‌ విషయానికొస్తే 0 నుంచి 60 యూనిట్ల వరకు 80 ఫిల్స్‌ నుంచి 200 ఫిల్స్‌కి (ఒక్కో యూనిట్‌) చేరుకుంటుంది. గత ఏడాది మార్చ్‌ నుంచి వాటర్‌ మరియు ఎలక్ట్రిసిటీ బిల్స్‌లో సంస్కరణలు తీసుకొచ్చారు. సబ్సిడీలు ఎత్తివేయడం, అలాగే ధరల్ని పెంచడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. 

Water and electricity tariff to double for expats in Bahrain

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com