మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు

- February 21, 2017 , by Maagulf
మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు

హైదరాబాద్‌: మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మహిళల 45 ఏళ్ల వయో విభాగం 800 మీటర్ల పరుగులో బబితా జాక్వలిన్‌ జేవియర్‌ స్వర్ణ పతకం సాధించింది. ఆమె 2.55.1 సెకన్ల టైమింగ్‌తో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక పురుషుల 5 కిలోమీటర్ల నడకలో సత్యం (80 ఏళ్లు) పసిడి నెగ్గాడు. సత్యం 37 నిమిషాల 4.5 సెకన్ల టైమింగ్‌తో రేసు పూర్తి చేశాడు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ 9 పతకాలు (2 స్వర్ణ, 4 రజత, 3 కాంస్య) సాధించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com