లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తికి డబుల్ జరిమానా
- February 22, 2017
దోహా : ఒకరి నిర్లక్ష్యం మరొకరి పాలిట శాపం కారాదు అని దోహా నేర న్యాయస్థానం లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన ఓ ట్యునీషియా వ్యక్తికి రెండు రకాల భారీ జరిమానాలు విధించింది. నిందితుడు చెల్లుబాటులో లేని కతర్ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడిపి మరొక వ్యక్తి గాయపడటానికి కారణమయ్యాడు. దీనితో దోహా క్రిమినల్ కోర్ట్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 3,000 కతర్ రియాళ్ళు, మరొక వ్యక్తి తీవ్రంగా గాయాలపాలవ్వడానికి కాణమయ్యాడని అందుకు అదనంగా మరో 3,000 కతర్ రియాళ్ళు జరిమాన విధించారు. ప్రతివాది గాయ పరిహారాన్ని చెల్లించేందుకు వాహన బీమా సంస్థ సహకారంతో 4,000 కతర్ రియాళ్ళు చెల్లించడానికి అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది .ప్రతివాది సల్వా రోడ్డు మీద ఒక చెల్లుబాటు కానీ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడపడమే కాక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారణంగా ఒక మోటూరిస్టు గాయపడ్డారు. మరొక వాహనం ని ఢీ కొట్టాడు. పరిశోధనల అనంతరం నిందితుడు తాను నడుపుతున్న వాహనాన్ని సరైన దారిలో నడపడంలో విఫలమయ్యాడని అలాగే నిందితునికి ఒక కాలపరిమితి దాటిపోయిన కతర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కల్గి ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









