పెరల్ ఖతార్లో పబ్లిక్ వైఫై ప్రారంభం
- February 22, 2017
పెరల్ ఖతార్లో విజిటర్స్ మరియు షాపర్స్ కోసం ఓరెడూ మరియు యుడిసి పబ్లిక్ వైఫైని ప్రారంభించాయి. సిస్కో బేస్డ్ ఓరెడూ సూపర్ నెట్ సొల్యూషన్ ఏర్పాటు చేసిన వైఫై ద్వారా అత్యధిక వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. పోర్టో అరేబియా, మెదినా సెంట్రల్ మరియు ఖనాత్ ఖాతియర్లలో ఇప్పటికే ఫుల్ కవరేజ్ అందిస్తోంది. ఓరెడూ కతార్ సీఈఓ వలీద్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ సయెద్ మాట్లాడుతూ, బెస్ట్ డేటా ఎక్స్పీరియన్స్ని వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. యుడిసితో కుదుర్చుకుని పబ్లిక్ వైఫై విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. యుడిసి ప్రెసిడెంట్ మరియు సిఇఓ ఇబ్రహీమ్ అల్ జాస్సిమ్ అల్ ఒత్మాన్ మాట్లాడుతూ, పెరల్ ఖతార్లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందజేస్తున్నామనీ, విజిటర్స్కి సూపర్ ఫాస్ట్ అలాగే అత్యంత నమ్మకమైన ఇంటర్నెట్ని అందించేందుకు ఈ పబ్లిక్ వైఫైని ఏర్పాటు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







