పెరల్‌ ఖతార్‌లో పబ్లిక్‌ వైఫై ప్రారంభం

- February 22, 2017 , by Maagulf
పెరల్‌ ఖతార్‌లో పబ్లిక్‌ వైఫై ప్రారంభం

పెరల్‌ ఖతార్‌లో విజిటర్స్‌ మరియు షాపర్స్‌ కోసం ఓరెడూ మరియు యుడిసి పబ్లిక్‌ వైఫైని ప్రారంభించాయి. సిస్కో బేస్డ్‌ ఓరెడూ సూపర్‌ నెట్‌ సొల్యూషన్‌ ఏర్పాటు చేసిన వైఫై ద్వారా అత్యధిక వేగంతో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది. పోర్టో అరేబియా, మెదినా సెంట్రల్‌ మరియు ఖనాత్‌ ఖాతియర్‌లలో ఇప్పటికే ఫుల్‌ కవరేజ్‌ అందిస్తోంది. ఓరెడూ కతార్‌ సీఈఓ వలీద్‌ మొహమ్మద్‌ ఇబ్రహీం అల్‌ సయెద్‌ మాట్లాడుతూ, బెస్ట్‌ డేటా ఎక్స్‌పీరియన్స్‌ని వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. యుడిసితో కుదుర్చుకుని పబ్లిక్‌ వైఫై విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. యుడిసి ప్రెసిడెంట్‌ మరియు సిఇఓ ఇబ్రహీమ్‌ అల్‌ జాస్సిమ్‌ అల్‌ ఒత్‌మాన్‌ మాట్లాడుతూ, పెరల్‌ ఖతార్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందజేస్తున్నామనీ, విజిటర్స్‌కి సూపర్‌ ఫాస్ట్‌ అలాగే అత్యంత నమ్మకమైన ఇంటర్నెట్‌ని అందించేందుకు ఈ పబ్లిక్‌ వైఫైని ఏర్పాటు చేశామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com