పెరల్ ఖతార్లో పబ్లిక్ వైఫై ప్రారంభం
- February 22, 2017
పెరల్ ఖతార్లో విజిటర్స్ మరియు షాపర్స్ కోసం ఓరెడూ మరియు యుడిసి పబ్లిక్ వైఫైని ప్రారంభించాయి. సిస్కో బేస్డ్ ఓరెడూ సూపర్ నెట్ సొల్యూషన్ ఏర్పాటు చేసిన వైఫై ద్వారా అత్యధిక వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. పోర్టో అరేబియా, మెదినా సెంట్రల్ మరియు ఖనాత్ ఖాతియర్లలో ఇప్పటికే ఫుల్ కవరేజ్ అందిస్తోంది. ఓరెడూ కతార్ సీఈఓ వలీద్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ సయెద్ మాట్లాడుతూ, బెస్ట్ డేటా ఎక్స్పీరియన్స్ని వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. యుడిసితో కుదుర్చుకుని పబ్లిక్ వైఫై విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. యుడిసి ప్రెసిడెంట్ మరియు సిఇఓ ఇబ్రహీమ్ అల్ జాస్సిమ్ అల్ ఒత్మాన్ మాట్లాడుతూ, పెరల్ ఖతార్లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందజేస్తున్నామనీ, విజిటర్స్కి సూపర్ ఫాస్ట్ అలాగే అత్యంత నమ్మకమైన ఇంటర్నెట్ని అందించేందుకు ఈ పబ్లిక్ వైఫైని ఏర్పాటు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









