పెరల్ ఖతార్లో పబ్లిక్ వైఫై ప్రారంభం
- February 22, 2017
పెరల్ ఖతార్లో విజిటర్స్ మరియు షాపర్స్ కోసం ఓరెడూ మరియు యుడిసి పబ్లిక్ వైఫైని ప్రారంభించాయి. సిస్కో బేస్డ్ ఓరెడూ సూపర్ నెట్ సొల్యూషన్ ఏర్పాటు చేసిన వైఫై ద్వారా అత్యధిక వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. పోర్టో అరేబియా, మెదినా సెంట్రల్ మరియు ఖనాత్ ఖాతియర్లలో ఇప్పటికే ఫుల్ కవరేజ్ అందిస్తోంది. ఓరెడూ కతార్ సీఈఓ వలీద్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ సయెద్ మాట్లాడుతూ, బెస్ట్ డేటా ఎక్స్పీరియన్స్ని వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. యుడిసితో కుదుర్చుకుని పబ్లిక్ వైఫై విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. యుడిసి ప్రెసిడెంట్ మరియు సిఇఓ ఇబ్రహీమ్ అల్ జాస్సిమ్ అల్ ఒత్మాన్ మాట్లాడుతూ, పెరల్ ఖతార్లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందజేస్తున్నామనీ, విజిటర్స్కి సూపర్ ఫాస్ట్ అలాగే అత్యంత నమ్మకమైన ఇంటర్నెట్ని అందించేందుకు ఈ పబ్లిక్ వైఫైని ఏర్పాటు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









