పార్కింగ్ చేసిన కార్లలో దొంగతనం: ఐదుగురికి జైలు శిక్ష
- February 22, 2017
పార్కింగ్ చేసిన కార్ల అద్దాల్ని పగలగొట్టి, దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అబుదాబీ క్రిమినల్ కోర్ట్, దొంగతనం కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఆసియన్లకు ఈ శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది చివర్లో వీరు పోలీసులకు చిక్కారు. తమ కార్ల నుంచి విలువైన వస్తువులు దొంగిలింపబడ్తున్నాయనీ, కార్ల అద్దాలు ధ్వంసం చేయబడ్తున్నాయనీ వాహనదారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పెద్దగా జనసంచారం లేని చోట్ల ఎక్కువ సమయం నిలిపివేయబడి ఉండే కార్లను నిందితులు టార్గెట్ చేసేవారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









