పార్కింగ్ చేసిన కార్లలో దొంగతనం: ఐదుగురికి జైలు శిక్ష
- February 22, 2017
పార్కింగ్ చేసిన కార్ల అద్దాల్ని పగలగొట్టి, దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అబుదాబీ క్రిమినల్ కోర్ట్, దొంగతనం కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఆసియన్లకు ఈ శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది చివర్లో వీరు పోలీసులకు చిక్కారు. తమ కార్ల నుంచి విలువైన వస్తువులు దొంగిలింపబడ్తున్నాయనీ, కార్ల అద్దాలు ధ్వంసం చేయబడ్తున్నాయనీ వాహనదారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పెద్దగా జనసంచారం లేని చోట్ల ఎక్కువ సమయం నిలిపివేయబడి ఉండే కార్లను నిందితులు టార్గెట్ చేసేవారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









