రియాద్ లో మాజీ భర్త చెర నుంచి ఒక మహిళను రక్షించిన పోలీసులు
- February 23, 2017
జెడ్డా : చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ...కఠిన శిక్షలు అమలవుతున్నప్పటికీ పురుషాధిక్యతను కొందరు మృగాళ్లు తమ హింసాధోరణి వీడటం లేదు..మాజీ భర్త చెర నుంచి మహిళని విడిపించడానికి పోలీసులకు ఓ చిన్నసైజ్ యుద్ధం చేయాల్సి వచ్చింది. రియాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజధాని పశ్చిమాన నివాస భవనంలో సౌదీలో నివసిస్తున్న ఒక వ్యక్తి తన నుంచి విడాకులు తీసుకుని దూరంగా తన బతుకు తానూ బతుకుతున్న తన మాజీ భార్యని ఆమె కూతురిని వారింట్లోనే ఆ సైకో భర్త బంధించాడు. వాళ్లింట్లో పనిచేస్తున్న పనిమనిషిని సైతం వారితోపాటు బంధించాడు. ఒక తుపాకీని, కొన్ని బుల్లెట్లను తనవెంట తెచ్చుకుని వారిని భయపెడుతూ, వారిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరే కూర్చోన్నాడు. అతను ఎంతకీ వారి ఇంటి ముందు నుంచి కదలకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తన నలభై ఏళ్ళ వయస్సులో మాజీ భర్తనుంచి విడాకులు తీసుకున్నానని కానీ, ఇప్పుడు హఠాత్తుగా ఎందుకిలా మమల్ని బాధపెట్టాలనుకున్నాడో అర్థం కావడంలేదని తమను అతడి బారీనుంచి రక్షించాలని ఆమె పోలీసులను కోరింది. దాంతో పోలీసులు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, వారిని రక్షించడానికి వారి ఇంటిని చుట్టుముట్టారు. అయితే నిందితుడు తలుపు దగ్గరే కూర్చోని ఉండటం వల్ల పోలీసుల రాకను గుర్తుపట్టి వారిపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతేకాక భవనం లోపల ఒక రక్షణ ప్రదేశం లోనికి వెళ్ళిపోయాడు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ డిఫెన్సె దళం సహాయంతో ఆ భవనం పైకి చేరుకొని ..ఇంటి పై కప్పుని పగలగొట్టి పోలీసులు చాకచక్యంగా ఆ వ్యక్తిని బంధించారు. ఈ ఆపరేషన్ లో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. కాగా దొరికిన నిందితుని వద్ద ఉన్న ఆటోమేటిక్ తుపాకీ , హ్యాండ్ గన్ లను స్వాధీనం చేసుకొన్నారు. బాధితులను అతని చెర నుంచి విడిపించారు. సైకో మాజీ భర్తని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







