ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్
- February 23, 2017
రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.100కి 10 జీబీ వరకు అదనపు 3జీ, 4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ కు ఇది అదనపు డేటా. రూ.500 పైబడిన ప్లాన్ తో కొనసాగుతున్నవారు ప్రస్తుతం 3జీబీ డేటాను పొందుతుంటే, మరో రూ.100 అదనంగా చెల్లించి 10జీబీ వరకు అదనపు డేటా పొందొచ్చు. ఈ ఆఫర్ కొన్నివారాల పాటు ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. 4జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పోస్ట్ పెయిడ్ కస్టమర్ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ 10జీబీ డేటా 28 రోజుల వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







