మౌన ప్రదర్శన ప్రవాసాంధ్రుల
- February 27, 2017
హూస్టన్, గుంటూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): 'విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వం.. శాంతిని ప్రేమిస్తాం..ఒకరికొకరుగా ఉంటే నిలబడతాం.. విడిపోతే కూలిపోతాం' అన్న నినాదాలతో కాన్సస్ నగరం దద్దరిల్లింది. జాతివివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివా్సకు నివాళిగా.. అక్కడి భారతీయులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, కాబోయే అధ్యక్షుడు సతీష్ వేమన బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలు తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జంపాల చౌదరి మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు మనోధైర్యంతో ఉండాలని సమస్యలు తాత్కాలికమేనని అన్నారు.
కాగా.. ప్యూరిన్టన్ కాల్పుల్లో గాయపడి కోలుకుంటున్న అలోక్రెడ్డి కుటుంబ సభ్యులను తానా ప్రతినిధులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్, కాల్పుల్లో గాయపడిన అలోక్ మిత్రులు, కాన్సస్ లెఫ్ట్నెంట్ గవర్నర్, ఒలాతే మేయర్, పోలీస్ చీఫ్ తదితరులు మాట్లాడారు. అలోక్ మాట్లాడుతూ శ్రీనివా్సతో తనది తొమ్మిదేళ్ల స్నేహమని చెప్పారు.
ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారికూడా అతడి నోటి వెంట నిర్లక్ష్యపూరిత మాటలు తాను వినలేదన్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









