బహరేన్ లో బస్సు లక్ష్యంగా బాంబు దాడి గాయపడిన ఐదుగురు పోలీసు అధికారులు
- February 28, 2017
దుబాయ్ : బస్సు లక్ష్యంగా ఐలాండ్ నేషన్ లో బాంబు దాడి జరగ్గా ఆ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారని బహరేన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి స్థిరమైన రీతిలో ఉందని అంతర్గత మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మతపెద్ద షేక్ ఇసా ఖ్అస్సిమ్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఆదివారం ఈ దాడి పోలీసులపై జరిగింది. గత ఏడాది జూన్ లో ఆ మతపెద్ద తన పౌరసత్వం కోల్పోయారు. అంతే కాకుండా దేశము నుండి బహిష్కరణకు సైతం గురయ్యారు. మతపెద్ద ఖ్అస్సిమ్ యొక్క తదుపరి విచారణ మార్చి 14 వ తేదీన జరగనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









