చైనా కు వార్నింగ్ ఇచ్చిన ఐఎస్ఐ
- March 02, 2017
ఓ వైపు ఇరాక్ లో తాము ఓడిపోయినట్లు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్డాది ప్రకటించినా.. మరోవైపు చైనాలో మాత్రం ఆ సంస్థ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము కచ్చితంగా దేశానికి తిరిగి వస్తామని, చైనాలో రక్తం ఏరులై పారిస్తామని ఉయ్ గర్ మైనారిటీకి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్పష్టం చేస్తున్నారు. చైనా లక్ష్యంగా ఐసిస్ చేసిన తొలి హెచ్చరిక కూడా ఇదే. సోమవారం విడుదల చేసిన అరగంట నిడివి గల వీడియోలో ఇస్లామిక్ స్టేట్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికాకు చెందిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. తన పశ్చిమ ప్రాంతమైన జిన్ జియాంగ్ లో హింసాత్మక ఘటనలకు బహిష్కరణకు గురైన అక్కడి ఉయ్ గర్ వేర్పాటు వాదులే కారణమని చైనా చాలా కాలంగా చెబుతూ వస్తోంది.
వీరికి గ్లోబల్ జిహాదీ గ్రూపులతో సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపించింది.
తాజా వీడియోలో ఓ ఇన్ఫార్మర్ ను హతమార్చే ముందు ఓ ఉయ్ గర్ ఉగ్రవాది ఈ హెచ్చరికలు జారీ చేశాడు. 'మీ చైనీస్ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోరు. మేం ఖలీఫా సైనికులం. ఆయుధాలతోనే మీకు సమాధానం చెబుతాం. రక్తాన్ని ఏరులుగా పారిస్తాం..' అని ఆ వీడియోలో హెచ్చరించాడు. ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంపై చైనా వివక్ష చూపుతున్నదని ఉయ్ గర్లు ఆరోపిస్తున్నారు. వారు తమకు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్నాయని అంగీకరించడం కూడా ఇదే తొలిసారి. ఇక ఐసిస్ నేరుగా చైనాకు హెచ్చరికలు చేయడం కూడా ఇదే మొదటిసారి అని నేషనల్ సెక్యూరిటీ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఎక్స్ పర్ట్ మైఖేల్ క్లార్క్ తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల లక్ష్యం చైనాయే అని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









