టర్కీలో తీవ్ర భూకంపం, 5.6గా నమోదు

- March 02, 2017 , by Maagulf
టర్కీలో తీవ్ర భూకంపం, 5.6గా నమోదు

దక్షిణ టర్కీలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. భవనాలన్నీ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పలువురు గాయపడ్డారు. అదియమన్‌ ప్రావిన్స్‌లోని సమత్‌ పట్టణంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం వచ్చిన అనంతరం నాలుగుసార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమత్‌ మేయర్‌ యూసఫ్‌ ఫిరాత్‌ పేర్కొన్నారు. సమత్‌ పట్టణంతో పాటు గజియాన్‌టేప్‌, కిలిస్‌, సాన్‌లియూర్ఫా ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లువెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com