దుబాయ్‌కి పవన్ ఏప్రిల్‌లో

- March 02, 2017 , by Maagulf
దుబాయ్‌కి పవన్ ఏప్రిల్‌లో

పవన్ కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ రూపొందించే సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నది. తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహించేందుకు నిర్మాత, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్‌. రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. పవన్, త్రివిక్రమ్‌ మునుపటి సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు కథానాయికలు.. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్‌.. నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను ఖుష్బూ పోషిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com