కాశీ విశ్వనాథునికి మోదీ పూజలు
- March 04, 2017
వారణాసి: తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన భారీ రోడ్షోలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. రోడ్షో చివరల్లో ఆయన ప్రఖ్యాత కాల భైరవ ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. తొలుత శనివారం ఉదయం బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఆయన రోడ్షో ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎంతో ఉత్సాహంగా రోడ్షోలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తల హంగామా, పార్టీ జెండాలతో రోడ్షో అంతా కాషాయమయమైంది. మార్గమధ్యంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశ్వనాథునికి హారతి పట్టారు. ఏడో దశ పోలింగ్లో భాగంగా వారణాసి, జన్పూర్లలో ప్రధాని ప్రసంగించనున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇవాళ వారణాసిలో సంయుక్తంగా రోడ్షోలో పాల్గొంటున్నారు. ఈనెల 8న యూపీ ఎన్నికల తుది విడత పోలింగ్ 46 నియోజకవర్గాల్లో జరుగనుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







