కాశీ విశ్వనాథునికి మోదీ పూజలు
- March 04, 2017
వారణాసి: తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన భారీ రోడ్షోలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. రోడ్షో చివరల్లో ఆయన ప్రఖ్యాత కాల భైరవ ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. తొలుత శనివారం ఉదయం బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఆయన రోడ్షో ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎంతో ఉత్సాహంగా రోడ్షోలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తల హంగామా, పార్టీ జెండాలతో రోడ్షో అంతా కాషాయమయమైంది. మార్గమధ్యంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశ్వనాథునికి హారతి పట్టారు. ఏడో దశ పోలింగ్లో భాగంగా వారణాసి, జన్పూర్లలో ప్రధాని ప్రసంగించనున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇవాళ వారణాసిలో సంయుక్తంగా రోడ్షోలో పాల్గొంటున్నారు. ఈనెల 8న యూపీ ఎన్నికల తుది విడత పోలింగ్ 46 నియోజకవర్గాల్లో జరుగనుంది.
తాజా వార్తలు
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!







