విలన్గా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నిర్మాత
- March 04, 2017
తెలుగు, తమిళ చిత్రాలను నిర్మంచిన రాక్లైన్ వెంకటేష్ విలన్గా రానున్నారు. 'లింగ' నష్టాల వ్యవహారంలో పంపిణీదారులు విలన్గా భావించిన నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిజంగానే విలన్గా మారారు. బాలా తెరకెక్కిస్తున్న 'నాచ్చియార్' చిత్రంలో ఆయన విలన్గా నటిస్తున్నారు. బాలా చిత్రాలను మొదటి నుంచి పరిశీలిస్తే విలన్ పాత్రధారులు దాదాపుగా నిర్మాతలే అయి ఉంటారు. 'నాన్ కడవుళ్'లో నిర్మాత అళగన్ తమిళ్ మణి, 'పరదేశి'లో నిర్మాత జేడి, 'తారా తప్పట్టై'లో నిర్మాత ఆర్కే సురేష్లను విలన్లుగా మార్చారు. ఆ జాబితాలో ఇప్పుడు 'లింగ' నిర్మాత రాక్లైన్ వెంకటేష్ను కూడా చేర్చారన్న మాట.
జ్యోతిక, జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'నాచ్చియార్' షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్







