తెలుగు డైరెక్టర్పై అత్త దాడి
- March 08, 2017
'గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలకు దర్శకత్వం వహించిన కొండా విజయ్ కుమార్ పై అతని అత్త చెప్పుతో దాడిచేసింది. తన కూతురికి మాయమాటలు చెప్పి విజయ్ కుమార్ పెళ్లి చేసుకున్నాడని అత్త ఆరోపించింది. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన ప్రసూన అనే యువతిని విజయ్ కుమార్ ఈ నెల 1న శ్రీనగర్ కాలనీలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. దీనిపై ప్రసూన తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. తన కూతురుకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని విజయ్ కుమార్ మాయమాటలు చెప్పాడని, అయితే అతను గతంలోనే వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, కొత్త దంపతుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి పోలీసులు విచారించారు.
తామిద్దరం మేజర్లమని ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయలేమన్నారు. దీంతో ఆగ్రహించిన ప్రసూన తల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే దాడికి ప్రయత్నించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!