జర్మనీ రైల్వే స్టేషన్లో గొడ్డలితో దాడి..ఏడుగురుకి గాయాలు
- March 09, 2017
విదేశాల్లో వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఓపక్క అమెరికాలో జాతి విద్వేశంతో తెల్ల జాతి దుండగులు కాల్పులతో రెచ్చిపోతుండగా జర్మనీలో ఓ వ్యక్తి గొడ్డలితో రాక్షసంగా ప్రవర్తించాడు. ఓ రైల్వే స్టేషన్లోకి చొరబడి విచక్షణా రహితంగా దొరికిన ప్రతి ఒక్కరిని నరకడం మొదలుపెట్టాడు. దీంతో దాదాపు ఏడుగురు గాయాలపాలయ్యారు. జర్మనీలోని డస్సెల్డార్ఫ్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి దాడులు ఇక్కడ జరుగగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం రాత్రి యుగోస్లావియాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ 36 ఏళ్ల వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడు.
అతడు అనూహ్యంగా గొడ్డలి తీసుకొని రాత్రి 8.50గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్లోకి అడుగుపెట్టి గొడ్డలితో తీవ్రంగా దాడికి చేశాడు. పోలీసులు అక్కడి చేరుకోవడంతో అతడు పారిపోయేందుకు ఓ పెద్ద గోడ నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అతడిని విచారించే పరిస్థితిల్లో లేడని, మానసికంగా దెబ్బతిని ఉన్నాడని మాత్రం తమకు అర్ధం అయిందని చెప్పారు. ఈ ఘటన కారణంగా స్టేషన్ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, ఎక్కడికక్కడా ట్రాఫిక్ జామ్ కూడా అయిందని అన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం ఎక్కడ చూసిన రక్తపు మరకలతో దర్శనం ఇచ్చింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







