కుక్కలని కాల్చబోతే ...కుర్రోడి ప్రాణాలు తీసిన బుల్లెట్.. ఒమాని వ్యక్తి అరెస్టు
- March 10, 2017
మస్కట్:మేకలను చంపుతున్న కుక్కల సమూహంపై తుపాకీతో కాల్చబోతే, గురి తప్పి ఆ బులెట్ ఓ నాలుగేళ్ళ ఓమాని బాలుడి ప్రాణాలను బలిగొంది. దీనితో సుడి లేని ఆ షూటర్ అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటన గత నెలలో జలాన్ బాణీ బు ఆలీ రాష్ట్రంలో జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం ఉంది. ఓ 30 ఏళ్ళ ఓమాని వ్యక్తి తన మేకలు అనేక మొత్తంలోచనిపోవడానికి కారణమైన కుక్కల మందపైకి కాల్పులు జరిపినట్లు నేర పరిశోధకుల ఎదుట అంగీకరించాడని తెలిపారు. విచ్చలవిడి బుల్లెట్లల ఒకటి తన దిశను మార్చుకొని పక్క వీధిలో తన స్నేహితునితో కూర్చొన్న ఓ నాలుగేళ్ల ఓమాని బాలుడి బుర్రలోకి బులెట్ దూసుకుపోవడంతో తక్షణమే ఆ చిన్నారి మరణించారు.మరో ఘటనలో 2015 లో డిబ్బా ప్రావిన్స్ లో ముసణ్డం ఒక వివాహ వేడుకల సమయంలో గాల్లోకి పేల్చిన ఓ బులెట్ ఒక నాలుగు ఏళ్ల సౌదీ బాలిక బుగ్గ ను తాకడంతో తీవ్రంగా గాయపడింది. తుపాకీ కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









