కుక్కలని కాల్చబోతే ...కుర్రోడి ప్రాణాలు తీసిన బుల్లెట్.. ఒమాని వ్యక్తి అరెస్టు
- March 10, 2017
మస్కట్:మేకలను చంపుతున్న కుక్కల సమూహంపై తుపాకీతో కాల్చబోతే, గురి తప్పి ఆ బులెట్ ఓ నాలుగేళ్ళ ఓమాని బాలుడి ప్రాణాలను బలిగొంది. దీనితో సుడి లేని ఆ షూటర్ అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటన గత నెలలో జలాన్ బాణీ బు ఆలీ రాష్ట్రంలో జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం ఉంది. ఓ 30 ఏళ్ళ ఓమాని వ్యక్తి తన మేకలు అనేక మొత్తంలోచనిపోవడానికి కారణమైన కుక్కల మందపైకి కాల్పులు జరిపినట్లు నేర పరిశోధకుల ఎదుట అంగీకరించాడని తెలిపారు. విచ్చలవిడి బుల్లెట్లల ఒకటి తన దిశను మార్చుకొని పక్క వీధిలో తన స్నేహితునితో కూర్చొన్న ఓ నాలుగేళ్ల ఓమాని బాలుడి బుర్రలోకి బులెట్ దూసుకుపోవడంతో తక్షణమే ఆ చిన్నారి మరణించారు.మరో ఘటనలో 2015 లో డిబ్బా ప్రావిన్స్ లో ముసణ్డం ఒక వివాహ వేడుకల సమయంలో గాల్లోకి పేల్చిన ఓ బులెట్ ఒక నాలుగు ఏళ్ల సౌదీ బాలిక బుగ్గ ను తాకడంతో తీవ్రంగా గాయపడింది. తుపాకీ కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







