మొదలైన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు
- March 10, 2017
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 20వేల భద్రతా సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. యూపీలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉత్తరాఖండ్లో 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంజాబ్లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లోకి ఎటువంటి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భద్రతా అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే గదుల్లో కేంద్ర భద్రతా బలగాలు మాత్రమే ఉంటారని, వెలుపల స్థానిక పోలీసులు ఉండనున్నట్లు ఈసీ వెల్లడించింది. గుర్తు తెలియని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్దకు అనుమతించవద్దని తెలిపింది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలకు సుమారు 100మీటర్ల దూరం వరకు వాహనాలు, పాదచారులను అనుమతించడానికి వీల్లేదు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







