భారత ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు సంఖ్యను పెంచిన సౌదీ
- March 12, 2017
ముస్లింలు మక్కా వెళ్లడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్నే హజ్ యాత్ర అంటారు. ప్రతీ సంవత్సరం సౌదీ ప్రభుత్వం ఒక్కొ దేశం నుంచి ఈ హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను నిర్ణయిస్తుంది. అయితే ఈ సంవత్సరం మన దేశం నుంచి హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను సౌదీ ప్రభుత్వం పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జనవరిలోనే విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా మార్చ్ 9 వరకు హజ్ యాత్రకు వెళ్లదలచుకున్నవారు దరఖాస్తులు చేసుకున్నారని భారత మైనారిటీ వ్యవహరాల శాఖ పేర్కొంది. మార్చ్14న డ్రా ద్వారా హజ్ యాత్రికులను ఎంపిక చేస్తామని అధికారులు సౌదీ ప్రభుత్వానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 2052 మంది హజ్ యాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఈ సంఖ్యను ప్రస్తుతం 2728కు పెంచారు. తెలంగాణ నుంచి గతంలో 2532 మంది వెళ్తే, ప్రస్తుతం వీరి సంఖ్యను 3367కు పెంచారు. కేరళ నుంచి అత్యధికంగా హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. రెండవస్థానంలో మహరాష్ట్ర, తర్వాతి స్థానాల్లో గుజరాత్, కర్ణాటకలు ఉన్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్యను 34,005గా సౌదీ ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







