అతి వేగమే ప్రమాదాలకు కారణం
- March 13, 2017
మస్కట్: 55 శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. 2015తో పోల్చితే 2016లో రోడ్డు ప్రమాదాలు 32.8 శాతం తగ్గినట్లు తేలింది. వీటిల్లో కూడా 55 శాతం ప్రమాదాలు అతి వేగం కారణంగానే జరిగాయి. స్పీడ్ లిమిట్ని పాటించని వాహనాల వల్ల 63 శాతం మంది గాయాల పాలయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వివరాల & రపకారం 2016లో మొత్తం 3261 ప్రమాదాలు చోటు చేసుకోగా, 692 మంది మృతి చెందారు. అతి వేగం కారణంగా 2499 ప్రమాదాలు జరిగాయి. 2052 మంది గాయాల పాలవగా, 378 మరణాలు అతి వేగతంతోనే జరిగినట్లు లెక్కలు తేల్చాయి. నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ కారణంగా 15 శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. రిస్కీ ఓవర్టేకింగ్ 10 శాతం మరణాలకు కారణం. 'యువర్ లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్' పేరుతో రాయల్ ఒమన్ పోలీసులు ఓ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచగలమని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







