భారీ వరదలు పెరూలో
- March 17, 2017
- 12 మందికి పైగా మృతి
పెరూలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ఈ వరదల్లో 12 మందికి పైగా మరణించారు. పెరూ రాజధాని లిమాలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద నీరు వీధుల్లోకి, నివాసాల్లోకి ప్రవేశించింది. దాదాపు 10 లక్షల మంది నివసించే ఈ నగరం గతంలో ఇలాంటి విపత్తులను ఎన్నడూ చవిచూడలేదు. ఈ వరదల్లో ఒక మహిళ కొట్టుకు పోతూ ఎట్టకేలకు సురక్షితంగా బయట పడిన ఘటనతో సహా కొన్ని దృశ్యాలను స్ధానికులు తమ సెల్ఫోన్లలో బంధించి ఇతరులతో పంచుకున్నారు. కొన్ని ఫామ్ హౌస్లలో నిర్మించిన కట్టడాలతో పాటు, పశువులు కూడా వరదల్లో కొట్టుకు పోయాయి.
వరదల్లో నివాసాలు కోల్పోయిన వారికి కొత్తవాటిని నిర్మించి ఇవ్వాలని పెరూ అధ్యక్షులు పెడ్రో పాబ్లో కుజిన్స్కి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







