జయ శోభన్బాబు కొడుకునంటూ కోర్టుకు ఫేక్ పత్రాలతో
- March 17, 2017
జయలలిత ఆస్తుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా.. జయ తనయుణ్ని నేనే అంటూ కృష్ణమూర్తి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దానికి సాక్ష్యాలంటూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాడు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవంటూ కోర్టు అతనికి స్ట్రాంగ్ వార్నింగిచ్చింది.
జయలలిత కుమారుణ్ని తానేనంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన క్రిష్టమూర్తి అనే వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనకు అతను సమర్పించిన పత్రాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవి నకిలీవని ఎల్కేజీ కుర్రాడు కూడా చెప్పేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కృష్ణమూర్తి తాను జయలలిత, శోభన్బాబుల కుమారుడిని అంటూ వాదిస్తున్నాడు. తాను 1985లో జన్మించానని.. ఏడాది తర్వాత ఈరోడ్లోని వసంతమణికి తనను దత్తత ఇచ్చేశారంటున్నాడు. ఇందుకు రుజువులుగా.. తనను వసంతమణికి దత్తత ఇస్తున్న ఫొటోలను, ఎంజీఆర్ సాక్షి సంతకం చేసిన దత్తత పత్రాలను కోర్టుకు సమర్పించాడు. అయితే కృష్ణమూర్తి సమర్పించిన పత్రాలన్నీ ఫేక్ డాక్యుమెంట్లని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై సిటీ కమిషనర్కు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. కోర్టుతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే జయలలితకు అసలైన వారసులు ఎవరనే వివాదం నడుస్తోంది. ఇంతలో కొత్తగా కృష్ణమూర్తి తెరపైకి వచ్చాడు. అతను చెబుతున్న దానిలో నిజమెంత అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







