51 మోటర్ బైక్స్ స్వాధీనం
- March 18, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ క్యాంపెయిన్లో భాగంగా 51 మోటార్ బైక్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజున ఈ వాహనాల స్వాధీనం జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అలి సయీద్ అల్ అల్కీమ్ మాట్లాడుతూ, అతి వేగంతో అర్థరాత్రి వేళ ప్రమాదకర రీతిలో నడుపుతున్న వాహనాలే సీజ్ చేసినవాటిలో అధికమని చెప్పారు. నివాసితులకు ఇబ్బంది కలిగించేలా వాహనాల్ని రఫ్గా నడిపేవారిపైనా కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ట్రాఫిక్ స్టాఫ్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ ఏరియాస్లో పర్యటించి, పబ్లిక్కి అవగాహన కల్పిస్తారనీ, ప్రమాదాల్ని నివారించడంలో వారి భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పారాయన. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి జరీమానాలతోపాటు, కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు కల్నల్ అల్కీమ్. సీజ్ చేసిన వాహనాలను జరీమానా చెల్లించి నెల రోజుల్లోగా సొంతదారులు తీసుకోవాలని, లేని పక్షంలో అవి వారెప్పటికీ పొందలేరని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







