51 మోటర్ బైక్స్ స్వాధీనం
- March 18, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ క్యాంపెయిన్లో భాగంగా 51 మోటార్ బైక్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజున ఈ వాహనాల స్వాధీనం జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అలి సయీద్ అల్ అల్కీమ్ మాట్లాడుతూ, అతి వేగంతో అర్థరాత్రి వేళ ప్రమాదకర రీతిలో నడుపుతున్న వాహనాలే సీజ్ చేసినవాటిలో అధికమని చెప్పారు. నివాసితులకు ఇబ్బంది కలిగించేలా వాహనాల్ని రఫ్గా నడిపేవారిపైనా కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ట్రాఫిక్ స్టాఫ్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ ఏరియాస్లో పర్యటించి, పబ్లిక్కి అవగాహన కల్పిస్తారనీ, ప్రమాదాల్ని నివారించడంలో వారి భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పారాయన. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి జరీమానాలతోపాటు, కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు కల్నల్ అల్కీమ్. సీజ్ చేసిన వాహనాలను జరీమానా చెల్లించి నెల రోజుల్లోగా సొంతదారులు తీసుకోవాలని, లేని పక్షంలో అవి వారెప్పటికీ పొందలేరని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







