సౌదీలో లేబర్ ఉల్లంఘనుల కోసం 90 రోజుల అమ్నెస్టీ
- March 20, 2017
ఇంటీరియర్ మినిస్ట్రీ, 'ఎ నేషన్ వితౌట్ వయొలేషన్స్' పేరుతో క్యాంపెయిన్ని ప్రారంభించింది. 90 రోజుల్లో ఉల్లంఘనలు, దేశం విడిచి వెళ్ళేందుకు ఈ అమ్నెస్టీ అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి పెనాల్టీలూ విధించకుండా ఈ అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ఈ అమ్నెస్టీని మంచి అవకాశంగా తీసుకోవాలని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ చెప్పారు. మార్చ్ 29 నుంచి ఈ అమ్నెస్టీ అమల్లోకి వస్తుంది. దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా అన్ని విభాగాలకూ తగు సూచనలు చేశారు క్రౌన్ ప్రిన్స్. ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, 19 ప్రభుత్వ శాఖలు ఈ క్యాంపెయిన్ని చేపట్టనున్నట్లు వివరించారు. హజ్ లేదా ఉమ్రా విజిట్ కోసం వచ్చి, ఎక్కువ కాలం ఇక్కడే అక్రమంగా నివసిస్తున్నవారు కూడా ఈ అమ్నెస్టీకి అర్హులని ఆయన తెలిపారు. అమ్నెస్టీ పీరియడ్ని వినియోగించుకోని ఉల్లంఘనులపై అమ్నెస్టీ ముగిసిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయి.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







