అడుగుపెట్టిన బంగ్లా ఉగ్రవాదులు భారత దేశంలోకి
- March 21, 2017
తమ దేశం నుంచి పలువురు ఉగ్రవాదులు భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక సమర్పించింది. గతంలో కంటే మూడింతలు అదనంగా ఉగ్రవాదులు చొరబడినట్లు పేర్కొంది. హర్కత్ ఉల్ జిహాది అల్ ఇస్లామి, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్కి చెందిన దాదాపు 2,010 ఉగ్రవాదులు 2016లో బంగ్లా సరిహద్దును దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినట్లు బంగ్లా అధికారులు ఒక నివేదికలో పేర్కొన్నారు. బెంగాల్ సరిహద్దు నుంచి 720 మంది, 1,290 మంది మాత్రం త్రిపుర, అసోం రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రవేశించినట్లు తెలిపింది. బంగ్లా ప్రభుత్వం ఇచ్చిన నివేదికపట్ల ఇప్పటికే బెంగాల్ తర్జనభర్జనలు పడుతుండగా త్రిపుర, అసోం రాష్ట్రాలు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







