ఈ స్థాయి లేదు మణిరత్నం గారిని కలవక పోతే : రెహ్మాన్
- March 21, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ మొదట కోటి వంటి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా చేసిన సంగతి విధితమే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన "రోజా" సినిమాతో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.. రోజా రిలీజైన అన్నీ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ లో రెహ్మాన్ సంగీతం కూడా భాగం పంచుకొన్నది. ఒక్క సినిమాతోనే యావత్ సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకొన్న రెహ్మాన్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకొన్నాడు.. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన కాట్రువెలియిడై కు సంగీతం అందించాడు.. సోమవారం ఉదయం చెన్నయ్ రాయపేటలోని సత్యం సినిమాస్ థియేటర్లో జరిగిన ఆడియో వేడుకలో పాల్గొన్న రెహ్మాన్ మాట్లాడుతూ.. నేను దర్శకుడు మణిరత్నం గారిని కలిసి ఉండక పోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాను.. అని పేర్కొన్నాడు.. ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతలు అందుకొంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం మణిరత్నం గారు అని తనకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన ఆయనపై అభిమానాన్ని చాటుకొన్నాడు.. రెహ్మాన్.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







