తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే
- March 22, 2017
తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తమలపాకు రసంతో శ్వాసకోశ వ్యాధులను, గొంతునొప్పి నివారణకు ఉపయోగించుకోవచ్చు. తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. అలాగే తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడితే.. గాయాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవినొప్పి తగ్గిపోతుంది. ఇంకా శరీరానికి తాంబూల సేవనం ఎంతో మేలు చేస్తుంది. ఎముకలకు మేలు చేసే క్యాల్షియం ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి.
ఇంకా తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఫైబర్ తమలపాకులో ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలు కలిపి తమలపాకును తీసుకుంటే శరీరానికి హాని చేస్తాయి. తమలపాకు యాంటీయాక్సిడెంట్ పనిచేస్తుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
ఇంకా ఆవనూనె, నువ్వులనూనె ఇతరత్రా నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకును వేసి నిల్వ చేయండి. తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. కాబట్టి సంతానం కోరుకునే వారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి. అయితే తమలపాకును ఔషధంగా మాత్రమే పరిమితంగా వాడుకోవాలి. అధిక రక్తపోటు గలవారు తమలపాకును దూరంగా పెట్టాలి. తమలపాకును అదే పనిగా తీసుకోకూడదు.
తమలపాకులో సున్నం, పొగాకు కలిపి తీసుకోకూడదు. రోజూ 2నెలల పాటు ఒక తమలపాకు 10 గ్రాముల మిరియం గింజలు కలిపి తీసుకుని వెంటనే చన్నీళ్లు తాగితే స్థూలకాయులు నాజూగ్గా తయారవుతారు. అలాగే తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో కలిగే క్షణికావేశం తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్స్గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









