'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకొని....గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య
- March 23, 2017
స్థానిక కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం ఆ మహిళ మృతదేహంను తమ సిబ్బంది ద్వారా కనుగొనబడిందని సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళకు ఏ కష్టం వచ్చిందేమో ఇలా అర్ధాంతరంగా తన ప్రాణాలు తీసుకొంది. ఉదయం 8 గంటల సమయంలో మెట్రో స్టేషన్ నిష్క్రమణ ద్వారం సమీపంలో ఏర్పాటు చేయబడిన ఒక ఇనుప గ్రిల్ కు ఉరి వేసుకొన్న స్థితిలో ఆ మహిళ మృతదేహం కనుగొనబడిందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ దళానికి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. ఆమె ధరించిన 'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నివేశ స్థలంలో ఉందని ఆ అధికారి తెలిపారు. మరణించిన మహిళ పేరు, చిరునామా ఇప్పటివరకు తెలియదని " నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా ఆమె దూరంగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే ఆధారం లేకుండా ఆ మహిళ జాగ్రత్తలు తీసుకోండని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







