'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకొని....గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య
- March 23, 2017
స్థానిక కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం ఆ మహిళ మృతదేహంను తమ సిబ్బంది ద్వారా కనుగొనబడిందని సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళకు ఏ కష్టం వచ్చిందేమో ఇలా అర్ధాంతరంగా తన ప్రాణాలు తీసుకొంది. ఉదయం 8 గంటల సమయంలో మెట్రో స్టేషన్ నిష్క్రమణ ద్వారం సమీపంలో ఏర్పాటు చేయబడిన ఒక ఇనుప గ్రిల్ కు ఉరి వేసుకొన్న స్థితిలో ఆ మహిళ మృతదేహం కనుగొనబడిందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ దళానికి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. ఆమె ధరించిన 'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నివేశ స్థలంలో ఉందని ఆ అధికారి తెలిపారు. మరణించిన మహిళ పేరు, చిరునామా ఇప్పటివరకు తెలియదని " నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా ఆమె దూరంగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే ఆధారం లేకుండా ఆ మహిళ జాగ్రత్తలు తీసుకోండని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









