బ్రిటన్ పార్లమెంట్ వద్ద కాల్పుల ఘటనలో 8మంది అరెస్టు

- March 23, 2017 , by Maagulf
బ్రిటన్ పార్లమెంట్ వద్ద కాల్పుల ఘటనలో 8మంది అరెస్టు

బ్రిటన్ పార్లమెంటు ఎదుట జరిగిన కాల్పుల ఘటనతో లండన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. భ‌ద్రతా బ‌ల‌గాలు అక్క‌డి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, అడుగడుగునా తనిఖీలు నిర్వహించి ప‌లువురిని అరెస్టు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దాడుల‌కు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. 
కాగా బుధవారం బ్రిట‌న్ పార్ల‌మెంట్ ద‌గ్గ‌ర దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీస‌ర్ తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంత‌రం థేమ్స్ బ్రిడ్జ్‌పై కారుతో బీభ‌త్సం సృష్టించిన ఘ‌ట‌న‌లో మ‌రో 40 మందికి గాయాల‌య్యాయి. వారిని హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. లండ‌న్‌తో పాటు బ‌ర్మింగ్‌హామ్ సిటీలో జ‌రిగిన త‌నిఖీల్లో ఈ అరెస్టులు జ‌రిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com