చనిపోయిన వ్యక్తికి గ్రీటింగ్స్ ఏంటి?
- March 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్, కొన్ని విషయాల్లో ప్రతిసారీ విమర్శలు ఎదుర్కోవడం శోచనీయంగా ఉంది. రియాద్లో మార్చ్ 9వ తేదీన నక్కా గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆ విషయాన్ని బంధువులకు తెలియజేసే క్రమంలో 'డియర్ నక్కా గంగాధర్' అని పేర్కొనడం పట్ల బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విషయాన్ని తెలియజేసే క్రమంలో, 'గ్రీటింగ్స్' అని పేర్కొంటూ మృతుడికే పంపుతున్నట్లుగా లెటర్ పంపడాన్ని బాధిత కుటుంబం ఆక్షేపణ తెలిపింది. తెలంగాణలోని జగిత్యాలలోగల మెట్పల్లికి చెందిన వ్యక్తి నక్కా గంగాధర్. కోలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమ్రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, మరణించిన వారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమనీ కంప్యూటర్ జనరేటెడ్ స్లిప్స్ కావడంతో పొరపాట్లు దొర్లుతున్నా, వాటిని సరిదిద్దవలసి ఉందని అన్నారు. చనిపోయిన వ్యక్తుల ఇ-మెయిల్కి వారి మరణానికి సంబంధించిన వివరాలు ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!









