చనిపోయిన వ్యక్తికి గ్రీటింగ్స్ ఏంటి?
- March 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్, కొన్ని విషయాల్లో ప్రతిసారీ విమర్శలు ఎదుర్కోవడం శోచనీయంగా ఉంది. రియాద్లో మార్చ్ 9వ తేదీన నక్కా గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆ విషయాన్ని బంధువులకు తెలియజేసే క్రమంలో 'డియర్ నక్కా గంగాధర్' అని పేర్కొనడం పట్ల బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విషయాన్ని తెలియజేసే క్రమంలో, 'గ్రీటింగ్స్' అని పేర్కొంటూ మృతుడికే పంపుతున్నట్లుగా లెటర్ పంపడాన్ని బాధిత కుటుంబం ఆక్షేపణ తెలిపింది. తెలంగాణలోని జగిత్యాలలోగల మెట్పల్లికి చెందిన వ్యక్తి నక్కా గంగాధర్. కోలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమ్రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, మరణించిన వారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమనీ కంప్యూటర్ జనరేటెడ్ స్లిప్స్ కావడంతో పొరపాట్లు దొర్లుతున్నా, వాటిని సరిదిద్దవలసి ఉందని అన్నారు. చనిపోయిన వ్యక్తుల ఇ-మెయిల్కి వారి మరణానికి సంబంధించిన వివరాలు ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







