నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి

- March 27, 2017 , by Maagulf
నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి

దుబాయి లో ఉరిశిక్ష పడ్డ తన భర్త కు ప్రాణబిక్ష పెట్టాలని ఓ మహిళా వేడుకుంది నిజామాబాదు జిల్లా,బాల్కొండ మండలం ,మెండోరా కు  చెందిన తన భర్త మాకూరి శంకర్  2005 లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ చిన్న సంస్థ లో  ఫోర్ మెన్ గా పని చేసేవాడని తెలిపింది. 2009లో అతని తో పాటు పనిచేస్తున్న రాజస్థాన్ కు చెందిన  రామావతార్ కుమావత్  ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడి  మృతి చెందటంతో  ఫోర్ మెన్  గా  ఉన్న  శంకర్ పై హత్యా నేరం  మోపి దుబాయిలో పుజిరా జైలులో బంధించినట్లు తెలిపింది .అప్పటినుంచి అతడు జైలులోనే ఉన్నాడని , ప్రస్తుతం అక్కడి కోర్టు శంకర్ కు ఉరిశిక్ష విధించిందని ఆమె తెలిపింది హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు క్షమాబిక్ష లేఖను సమర్పిస్తే శంకర్ ను విడుదల చేస్తారని తెలిపింది .అర్మూర్ కు  చెందిన సామజిక వేత్త  దేగాం  యదా గౌడ్ రాజస్థాన్ వెళ్లి అక్కడి ప్రముఖులు పెద్దలతో కలిసి, కుమావత్  కుటుంబసభ్యులను కలవగా వారు క్షమాబిక్ష లేక ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ,అయితే తాము ఇంటిలో పెద్ద దిక్కు కోల్పోయి పేదరికం లో ఉన్నామని,అందుకు రూ. 6. లక్షలు ఇవ్వాలని కోరుతున్నారని తెలిపింది. దాతలు ప్రభుత్వము  జోక్యం చేసుకొని తన భర్తను విడిపించాలని వేడుకుంది ఆర్థిక సహాయం అందించే వారు  9848248894,9908600534 నెంబరు లోగాని తెలంగాణ గ్రామీణ బ్యాంక్  పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ 79039814635 ifcsc  కోడ్ :BHYORRDCGB కి పంపాలని కోరారు.తాను వ్యవసాయ కూలీగా పని చేస్తూ కొడుకును పోషించుకుంటున్నానని,తాను ఆరు నెలల గర్భవతి గా  ఉన్నప్పుడు తన  భర్త శంకర్ దుబాయ్ వెళ్లాడని , ఆతర్వాత  నెలరోజులకు పోనే చేసినట్లు తెలిపింది. ఆయన తప్పు ఏమిలేకున్నా జైలులో పెట్టారని , ఇంతవరకు కొడుకును చేసుకోలేదని విలపించింది .ప్రభుత్వం తన భర్తను విడిపించేందుకు కు కృషి చేయాలనీ వేడుకుంది.  

-సాయికృష్ణ యాదవ్.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com