హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వివేక్
- March 31, 2017
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ఎన్నికయ్యారు. పాలకవర్గం కోసం జనవరి 17న ఎన్నికలు నిర్వహించారు. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఓట్లను లెక్కించారు. అధ్యక్ష పదవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, మాజీ ఆటగాడు విద్యుత్ జయసింహ పోటీపడ్డారు. అయితే విద్యుత్ జయసింహపై 68 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. మొత్తం ఓట్లలో వివేక్కు 136, జయసింహకు 68 ఓట్లు దక్కాయి. అన్ని స్థానాల్లోనూ వివేక్ ప్యానెల్ గెలుపొందింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. హెచ్సీఏకు పూర్వవైభవం తీసుకొస్తానని మాటిచ్చారు. లోధా కమిటి సిఫార్సుల మేరకే ఎన్నికలు జరిగినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







