దోహా నుంచి ఇండియాకి ఇండిగో సేవలు

- April 04, 2017 , by Maagulf
దోహా నుంచి ఇండియాకి ఇండిగో సేవలు

ఇండియాకి చెందిన ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ సంస్థల్లో ఒకటైన ఇండిగో, దోహా నుంచి ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. భారతదేశంలోని ఏడు నగరాలకు తమ ఎయిర్‌లైన్‌ సేవల్ని విస్తరించాలని ఇండిగో భావిస్తోంది. బాంబే, ఢిల్లీ, కాలికట్‌, కొచ్చి, త్రివేండ్రమ్‌, చెన్నయ్‌ తదితర నగరాలను దోహాతో కలుపుతూ విమన సర్వీసుల్ని నడపాలని ఇండిగో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలియవస్తోంది. ఏప్రిల్‌ రెండో వారంలోనే ఈ సర్వీసలు ప్రారంభమయ్యే అవకశాలున్నాయి. మార్చి 20న కాలికట్‌ నుంచి షార్జాకి విమాన సర్వీసుని ఇండిగో ప్రాచంరభించింది. అలాగే త్రివేండ్రం నుంచి షార్జాకి ఏప్రిల్‌ 8వ తేదీన మరో విమాన సర్వీసను ప్రారంభించనున్నారు. ఢిల్లీ - దోహా మధ్య విమాన సర్వీసుని 2016లోనే ప్రారంభించాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది. దోహా నుంచి ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ మరియు జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రమే ఇండియా తరఫున విమాన సర్వీసుల్ని నడుపుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com