దోహా నుంచి ఇండియాకి ఇండిగో సేవలు
- April 04, 2017
ఇండియాకి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఒకటైన ఇండిగో, దోహా నుంచి ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. భారతదేశంలోని ఏడు నగరాలకు తమ ఎయిర్లైన్ సేవల్ని విస్తరించాలని ఇండిగో భావిస్తోంది. బాంబే, ఢిల్లీ, కాలికట్, కొచ్చి, త్రివేండ్రమ్, చెన్నయ్ తదితర నగరాలను దోహాతో కలుపుతూ విమన సర్వీసుల్ని నడపాలని ఇండిగో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలియవస్తోంది. ఏప్రిల్ రెండో వారంలోనే ఈ సర్వీసలు ప్రారంభమయ్యే అవకశాలున్నాయి. మార్చి 20న కాలికట్ నుంచి షార్జాకి విమాన సర్వీసుని ఇండిగో ప్రాచంరభించింది. అలాగే త్రివేండ్రం నుంచి షార్జాకి ఏప్రిల్ 8వ తేదీన మరో విమాన సర్వీసను ప్రారంభించనున్నారు. ఢిల్లీ - దోహా మధ్య విమాన సర్వీసుని 2016లోనే ప్రారంభించాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది. దోహా నుంచి ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు జెట్ ఎయిర్వేస్ మాత్రమే ఇండియా తరఫున విమాన సర్వీసుల్ని నడుపుతున్నాయి.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









