అమెరికాలో మరో ఘోరం భారతీయుడ్ని కాల్చి చంపారు
- April 07, 2017
అమెరికాలో మరో ఘోరం జరిగింది. మరో భారతీయుడ్ని కాల్చి చంపేశారు. 26 ఏళ్ల విక్రమ్ జర్యాల్ అనే యువకుడ్ని పొట్టన పొట్టుకున్నారు. యకిమా సిటీలో ఏఎమ్-పీఎమ్ అనే గ్యాస్ స్టేషన్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు విక్రమ్ జర్యాల్.
ఆయుధాలతో గ్యాస్ స్టేషన్కి వచ్చిన ఇద్దరు దుండగులు, విక్రమ్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు. కౌంటర్లోవున్న నగదు ఇచ్చాక విక్రమ్పై కాల్పులు జరిపారు. గాయాలతో బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అమెరికా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
విక్రమ్ సొంతూరు పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా.
గతనెల ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు.. ఇంతలోనే ఇలా జరగడం ఫ్యామిలీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన తెలుసుకున్న అక్కడ భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. ఇది జాత్యహంకార దాడేనని ఆరోపిస్తున్నారు.
విక్రమ్ హత్య విషయాన్ని ఆయన సోదరుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. హత్యను ఖండించిన సుష్మ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







