జీ నెట్ వర్క్ చేతికి మహేష్బాబు 'స్పైడర్'
- April 12, 2017
మహేష్బాబు 'స్పైడర్' గురించి లేటెస్ట్ న్యూస్. బుధవారం ప్రిన్స్ ఫస్ట్ లుక్ రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి. ఫిల్మ్నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. స్పైడర్ శాటిలైట్ రైట్స్ని జీ నెట్వర్క్ దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ కలిపి దాదాపు 26 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక విధంగా చెప్పాలంటే ప్రిన్స్ కెరీర్లో శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్కి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్. దీన్ని కొనుగోలు చేసేందుకు జెమినీ, స్టార్ ఛానెల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చివరకు జీ సొంతమైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్లో మహేష్బాబు నిఘా అధికారిగా కనిపించనున్నాడు. ప్రిన్స్ పక్కన హీరోయిన్గా రకుల్ నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జె సూర్య విలన్. జూన్ 23న థియేటర్స్కి స్పైడర్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







