అమెరికా ప్రభుత్వం...మరో కఠినమైన నిర్ణయం
- April 16, 2017
ఒకప్పటి రంగుల కళ... ఇక కలగా మారనుంది. ట్రంప్ సర్కారు తీసుకొస్తున్న ఒక్కో రూల్స్ అమెరికాలోని ప్రవాస భారతీయులకు వణుకుపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ బ్యాన్, H1B వీసాలపై కఠిన నిబంధనలు, H4 వీసాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న అమెరికా ప్రభుత్వం...మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని నిర్బంధించేందుకు ఆదేశాలు జారీచేది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దేశంలోని ఎన్నారైల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. అమెరికాకు పునర్ వైభవం తీసుకొస్తానంటూ ఎన్నికల్లో శపధం చేసిన ట్రంప్... దేశంలోకి అక్రమ వలసలను, అక్రమ వలసదారులను పనిపట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ప్రాసిక్యూటర్లకు, పోలీసు అధికారులకు, జడ్జీలకు అటార్ని జనరల్ జెఫ్ సెషన్స్ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులను గుర్తించడం, నిర్భంధించడం, తిరిగి వెనక్కి పంపించడం అనే నినాదంతో అమెరికా అధికారులు రంగం సిద్దం చేశారు. ఇన్నాళ్లు స్టేట్ మెంట్లు, ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు జారిచేయడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారికి కష్టాలు తప్పేలా లేవు..
అక్రమ వలసదారుల కారణంగా అమెరికన్ యువత ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతుందన్న కారణంగా అధ్యక్షుడు ట్రంప్....అక్రమ వలసదారులను ఏలాగైనా దేశం నుంచి పంపించాలని భావిస్తున్నారు. ఎన్నికైన తర్వాత అదే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నారు. దేశంలోకోటి మందికిపైగా అక్రమ వసలదారులు ఉండొచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే అమెరికాలో భారత్, మెక్సికో, చైనా దేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో వలసవెళ్లి నివసిస్తున్నారు. వీరిలో మెక్సికన్లే ఎక్కువ. దాదాపు 5లక్షలమంది ప్రవాస భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా టూరిస్టు, స్టూడెంట్స్, తాత్కాలిక వీసాలపై వెళ్లినవారే. అమెరికా ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆదేశాలు సిలీకాన్ వ్యాలీ లోని భారతీయ సాప్ట్ వేర్ ఉద్యోగులు, వలసదారులే లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ట్రంస్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం అంత సులభమేమి కాదని ఇమ్మిగ్రేషన్ అధికారులు అంటున్నారు. దౌత్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









