మొబైల్ ఫోన్ తో విద్యార్థి తలపై కొట్టి ఉద్యోగం పోగొట్టుకొన్న ఉపాధ్యాయుని వైనం
- April 22, 2017
మనామ: రాజ్యంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు తలపై మొబైల్ ఫోన్ తో బలంగా మోదాడు. దాంతో ఆ విద్యార్థి తలకు సెంటీమీటర్ పొడవు మేర గాయం ఏర్పడింది. బాలుడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఐదవ తరగతి చదువుతున్న ఆ బాలుడు సోషల్ మీడియా వేదికలపై తనకు జరిగిన సంఘటన గురించి ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు, ఇది వైరల్ గా తక్షణమే మారింది. ఈ సంఘటన ఫలితంగా, ఒక అరబ్ జాతీయుడైన ఆ ఉపాధ్యాయుడిపై విద్య మంత్రిత్వశాఖ స్పందించి ఆ సంఘటనపై విచారణ జరిపించిన తర్వాత ఆ ఆరోపణ వాస్తవమని గుర్తించడంతో ఆ ఉపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకొన్నారు. తన కోపం కారణంగా శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఈ సంఘటన మంగళవారం జరిగింది, బాలుడు మరియు అతని తోటి విద్యార్ధులు దోహార్ ఆరాడ్ పార్క్ మరియు ముహారక్లోని సహజ అభయారణ్యంలకు పాఠశాల విహారయాత్రకు వెళ్లారు.వీడియో ఫుటేజ్ లో చూపినట్లుగా ఆ బాలుడు తన తండ్రికి 'హాయ్' అని చెప్పినప్పుడు, గురువు ఆమోదించక మొబైల్ ఫోన్ తో తలపై కొట్టినట్లు ఆ బాలుడి సాక్ష్యం రికార్డ్ కాబడింది." నేనుఏద్వడం ప్రారంభించాను మరియు మరొక గురువు వచ్చి రక్తంతో ఉన్ననా తల మరియు ముఖం కడగడం జరిగిందని " ఆ బాలుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో క్షిపణులు, డ్రోన్ల ముప్పు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థలు
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!







