బహ్రెయిన్ తెలుగు కళాసమితి ఉగాది వేడుకలు
- April 25, 2017
ఏప్రిల్ 21న బహ్రెయిన్ తెలుగు కళా సమితి, ఉగాది వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్, ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా హారయ్యారు. తెలుగు వారికి ఉగాది ఎంతో ప్రత్యేకమైన పండుగ కావడంతో, పెద్ద సంఖ్యలో తెలుగువారు ఈ పండుగకి హాజరై, ఆనందోత్సాహాల మధ్య ఉగాది వేడుకల్ని జరుపుకున్నారు. నోరూరించే పిండి వంటలు, ప్రత్యేక తెలుగు వంటకాలతో ఉగాది సంబరాలు మిన్నంటాయి. ఏప్రిల్ 21న ఉదయం 9.30 నిమిషాలకు బహ్రెయిన్ కేరళీయ సమాజంలో ఈ వేడుకలు జరిగాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. పంచాంగ పఠనం, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటికలతో ఉగాది వేడుకల్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించడం గమనించదగ్గ అంశం.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









